యాప్నగరం

ఎదిగిన పిల్లలున్న తల్లికి గర్భం.. అవమానంతో ఆత్మహత్య.. అనంతపురంలో విషాదం

పార్వతమ్మకి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకుంది. ఒంట్లో బాగోడం లేదని ఆస్పత్రికెళ్తే గర్భం వచ్చిందని చెప్పడంతో..

Samayam Telugu 17 Jul 2020, 5:03 pm
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆపరేషన్ విఫలమై గర్భం దాల్చడాన్ని అవమానంగా భావించిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్, పార్వతమ్మ(36) భార్యాభర్తలు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం. అనంతరం పిల్లలు పుట్టకుండా ఆమె ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేయించుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


అయితే ఆపరేషన్ విఫలమై ఇటీవల ఆమె గర్భం దాల్చింది. శరీరంలో మార్పులతో అనుమానం వచ్చిన పార్వతమ్మ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో గర్భంతో ఉన్న విషయం తెలిసింది. ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో ఆమె మనస్థాపానికి గురైంది. ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉండగా తాను గర్భం దాల్చడాన్ని అవమానంగా భావించింది. ఇంట్లో విషపు గుళికలు తిని ఆత్మహత్యా యత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది.

Also Read: హారన్ కొడితే హత్యలు.. సైకో బ్రదర్స్ కిరాతకం.. కాల్చిపారేసిన ఖాకీలుAlso Read: అడుక్కుని కోట్లకు పడగలెత్తిన అత్త.. అద్దె కోడలికి కన్నుకుట్టి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.