యాప్నగరం

అందంగా లేవన్న భర్త, భార్య ఆత్మహత్య.. తూర్పుగోదావరిలో విషాదం

పెళ్లైన పదకొండు నెలలకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. భర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మానసికంగా, శారీరకంగా హింసించడంతో బలవన్మరణానికి పాల్పడింది.

Samayam Telugu 10 May 2020, 2:17 pm
పెళ్లై ఏడాది కూడా ముగియకుండానే యువతికి నూరేళ్లు నిండాయి. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. కట్టుకున్న భర్తే అందంగా లేవంటూ మానసికంగా హింసిండంతో వివాహిత అఘాయిత్యానికి పాల్పడింది. కడుపులో బిడ్డతో సహా ఈలోకాన్ని విడిచిపెట్టింది. ఈ అత్యంత విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జిల్లాలోని ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన దూలం ఏకాంబిక(22)కు సమీపంలోని మోడేకుర్రుకు చెందిన దుర్గాప్రసాద్‌తో సుమారు 11 నెలల కొందట వివాహమైంది.పెళ్లైన ఆరు నెలలకే ఆమె గర్భం దాల్చింది. కొద్దికాలం భార్యతో సఖ్యతగానే ఉన్న దుర్గాప్రసాద్ వేధించడం మొదలుపెట్టాడు. నువ్వు అందంగా లేవంటూ మానసికంగా, శారీరకంగా హింసించాడు.

Also Read: భార్య నగ్నచిత్రాలు ఫ్రెండ్స్‌కి.. వారితో సెక్స్ చేయాలని వేధింపులు.. చివరికి..

గర్భం దాల్చడంతో పుట్టింటికి వెళ్లిన తన బాధ ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయింది. భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపులో బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లై ఏడాది కూడా గడవకుండానే ఆమె ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: గెస్ట్‌హౌస్‌లో గుట్టుగా వ్యభిచారం.. సడెన్‌గా పోలీసులు గది తలుపు తీయడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.