యాప్నగరం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బోల్తాకొట్టిన ప్రైవేటు బస్సు

బెంగళూరు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఆ సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 27 Feb 2020, 8:51 pm
అతివేగంగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. కోల్‌కతా చెన్నై జాతీయ రహదారిపై సింగరాయకొండ సమీపంలోని జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu bus.


Also Read: ఆపదలో ఉన్న యువతిపై రెండుసార్లు రేప్.. ఆదుకోని ముక్కుపుడక

బస్సు బోల్లా పడడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు బెంగుళూరు నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: సినీనటికి ఆ ఫోన్‌కాల్స్.. పిజ్జా ఆర్డర్ చేసిన పాపానికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.