యాప్నగరం

ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పాడుపని, ఇద్దరు మహిళల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Samayam Telugu 7 Jan 2021, 8:57 am
జనావాసాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న వ్యభిచార గృహంపై హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పోలీసులు దాడి చేశారు. కడప జిల్లా పులివెందుల మండలానికి చెందిన ఓ మహిళ(50) కొంతకాలం క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో వ్యభిచారంలోకి దిగింది. ఎల్బీనగర్‌ సమీపంలోని రాక్‌టౌన్‌కాలనీలోని ఓ అపార్టుమెంటులో ఓ ప్లాట్ అద్దెకు తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి ఇద్దరు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నడిపిస్తోంది.
Samayam Telugu Image


Also Read: వికారాబాద్‌: కరాటే కలిపిన బంధం.. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

కర్నూలు జిల్లాకు చెందిన మరో మహిళ(38)తో కూడా ఆమెతో కలిసి విటులను ఆకర్షిస్తోంది. కొద్దిరోజులుగా గుట్టుగా కొనసాగుతున్న ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు, వీరికి సహాయం చేస్తున్న మన్సూరాబాద్‌కె చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.