యాప్నగరం

మచిలీపట్నం: జనావాసాల మధ్య గుట్టుగా వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

కృష్ణా జిల్లా కేేంద్రం మచిలీపట్నంలోని శిడింబి అగ్రహారంలో గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రంపై చిలకలపూడి పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Samayam Telugu 2 Jan 2021, 8:21 am
కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై శుక్రవారం రాత్రి చిలకలపూడి పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ విటుడితో పాటు మరో సెక్స్‌ వర్కర్, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. చిలకలపూడి పీఎస్ పరిధిలోని శిడింబి అగ్రహారంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న మహిళ ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం చేయిస్తోంది. ఇటీవల ఆ ఇంటికి యువకుల తాకిడి పెరగడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Samayam Telugu Image


Also Read: పెళ్లి పేరుతో యువకుడికి గాలం.. రూ.21లక్షలు దోచుకున్న దంపతులు

దీంతో సీఐ అంకబాబు ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం ఆ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. విటుడు, నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు సెక్స్‌వర్కర్‌ని ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. పట్టణంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని సీఐ అంకబాబు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.