యాప్నగరం

అమ్మా నాన్నతోపాటు ఐదుగురిని కాల్చి చంపిన యువకుడు

Punjab | క్షణికావేశంలో ఓ యువకుడు కుటుంబంలోని మూడేళ్ల చిన్నారి సహా ఐదుగురు సభ్యులను కాల్చి చంపాడు. తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 3 Aug 2019, 8:43 pm
దొంగిలించిన తుపాకీతో కుటుంబంలోని ఐదుగురిని దారుణంగా కాల్చి చంపాడు ఓ యువకుడు. అనంతరం తానూ కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని మోగా జిల్లాలో శుక్రవారం (ఆగస్టు 2) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu Sandeep singh


భాగాపురాణాలోని నాథువాలా గర్భీ గ్రామంలో సందీప్ సింగ్ (28) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వారికి గ్రామంలో సుమారు 25 ఎకరాల భూమి ఉంది. ఇటీవల ఆ భూమిలోని కొంత భాగాన్ని కుటుంబ పెద్ద మరో వ్యక్తి పేరున బదలాయించాడు. ఈ విషయం సందీప్ సింగ్‌కు నచ్చలేదు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అతడు శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులపై తుపాకీతో కాల్పులు జరిపాడు.

Read also: చదివింది టెన్త్.. అతడి వలలో ఓ సెలబ్రిటీ, 500 మంది అమ్మాయిలు!

తండ్రి మంజిత్‌ సింగ్‌, తల్లి బిందర్‌ కౌర్‌, సోదరి అమన్‌జోత్‌ కౌర్‌, నానమ్మ గుర్‌దీప్‌ కౌర్‌‌లతోపాటు మేనకోడలు మనీత్‌ కౌర్‌(3)లను దారుణంగా హతమార్చాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సందీప్ తాత గురుచరణ్ సింగ్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read also: పెళ్లైన 20 రోజులకే భర్తను చంపేసింది.. కారణం తెలిసి పోలీసులు షాక్

భూమి మరొకరికి బదిలీ చేయడంపై తీవ్ర కలత చెందాననీ, అందుకే అందరినీ చంపి, ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒక లేఖలో పేర్కొన్నాడు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని సందీప్ సింగ్ బంధువుల నుంచి దొంగిలించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.