యాప్నగరం

2 కి.మీ. పొడవైన రైలు పట్టాలు ఎత్తుకెళ్లిన దొంగలు.. విస్తుపోయిన పోలీసులు

బిహార్‌లోని సమస్తీపుర్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో పనికిరాని రైలు పట్టాలను దొంగలు అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ పట్టాల పొడవు దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది. గతంలో మధుబని లోహత్‌ షుగర్‌ మిల్‌ నుంచి పండోల్‌ స్టేషన్‌ వరకు రైల్వే లైన్‌ వేశారు. కానీ, ఏళ్ల తరబడి ఈ చక్కెర మిల్లు మూతపడి ఉండటంతో ఈ మార్గం వినియోగంలో లేదు. దీంతో దొంగలు ఈ పట్టాలను తొలగించి తీసుకెళ్లిపోయారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 7 Feb 2023, 3:00 pm

ప్రధానాంశాలు:

  • కోట్ల రూపాయలు రైలు పట్టాలు దొంగతనం
  • రైల్వే సిబ్బంది సహకారంతో ఎత్తుకెళ్లిన దొంగలు
  • పలువురు సిబ్బందిని సస్పెండ్ చేసిన ఉద్యోగులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Railway Track
పాత వంతెనలు, రైలు ఇంజిన్లను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనలు బిహార్‌లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా, నిరుపయోగంగా ఉన్న రైలు పట్టాలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన సమస్తీపుర్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దాదాపు రెండు కిలోమీటర్లు పొడవున్న రైలు పట్టాలను ఎత్తుకెళ్లడం గమనార్హం. మధుబని లోహత్‌ షుగర్‌ మిల్‌ నుంచి పండోల్‌ స్టేషన్‌ వరకు గతంలో ప్రత్యేకంగా రైల్వే లైన్‌ వేశారు. అయితే, చాలా కాలం నుంచి ఈ చక్కెర మిల్లు మూతబడింది. దీంతో ఈ మార్గంలో రైల్లు రాకపోకలు నిలిచిపోయి వినియోగంలో లేదు. వీటిపై దొంగల కన్నుపడింది.
ఈ పట్టాలను తొలగించి తీసుకెళ్లిపోగా... జనవరి 24న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదుచేసి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇందులో రైల్వే అధికారుల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అటు, రైల్వే ఉన్నతాధికారులు దీనిని తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటన బాధ్యుల్ని చేస్తూ డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను రైల్వే శాఖ సస్పెండ్‌ చేసింది. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

సమస్తీపూర్ రైల్వే డివిజనల్ మేనేజర్ అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘పట్టాల చోరీపై శాఖాపరమైన విచారణకు ఓ కమిటీని నియమించాం.. ఈ విషయం గురించి రైల్వే శాఖకు సకాలంలో సమాచారం ఇవ్వనందుకు ఝంఝర్‌పూర్ ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జి శ్రీనివాస్‌, మధుబని రైల్వే డివిజన్ చెందిన జమాదార్ ముఖేష్ కుమార్ సింగ్ సహా ఇద్దరు సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేశారు.. రైల్వే లైన్‌లోని స్క్రాప్‌ను వేలం వేయకుండా ఆర్పీఎఫ్ సహకారంతో స్క్రాప్ డీలర్‌కు విక్రయించినట్లు సమాచారం.. ఈ విషయంపై రైల్వే శాఖలో కలకలం రేగుతోంది’’ అని అన్నారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.