యాప్నగరం

2 రోజుల్లో 10 మంది శిశువుల మృత్యువాత! ఈ నెలలోనే 77 మంది!

రాజస్థాన్‌లోని కోటలోని జేకే లాన్‌ ఆస్పత్రిలో కేవలం రెండు రోజుల్లోనే 10 మంది శిశువులు మృత్యువాత పడ్డారు. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది.

Samayam Telugu 27 Dec 2019, 8:25 pm
రాజస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో కేవలం రెండు రోజుల్లోనే 10 మంది శిశువులు మృత్యువాత పడటం సంచలనం రేపుతోంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు అంతలోనే శాశ్వత నిద్రలోకి జారుకోవడం కలకలం రేపుతోంది. కోటలోని జేకే లాన్‌ ఆస్పత్రిలో డిసెంబర్ 23న ఆరుగురు, డిసెంబర్ 24న నలుగురు శిశువులు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు ఆడ శిశువులుండగా, మిగతా ఐదుగురు మగ శిశువులు ఉన్నారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువులు మరణించారని బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనలు చేపట్టారు.
Samayam Telugu infant-deaths


Also Read: ఆశ్రయమిచ్చిన యజమాని తొమ్మిదేళ్ల కూతురిపై రేప్!

ఈ ఘటనపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈ దుర్ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెండ్‌ డాక్టర్ హెచ్‌ఎల్‌ మీనా మాట్లాడుతూ.. సాధారణంగా ఆస్పత్రిలో రోజుకు ఒకటి, రెండు మరణాలు సంభవిస్తూ ఉంటాయని, కానీ రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు మరణించడం బాధాకరమన్నారు. కానీ ఇదేమీ అసాధారణమేమీ కాదని చెప్పుకొచ్చారు.

శిశువుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కొందరిని ఇతర ఆస్పత్రులకు తీసుకెళ్లాలని కోరినట్లు పేర్కొన్నాడు. అయితే ఆక్సిజన్‌ అందక, ఇన్‌ఫెక్షన్‌ వల్ల, పలు కారణాల రీత్యా శిశువులు పుట్టిన 24 నుంచి 48 గంటల్లోనే మృతి చెందారని ఓ వైద్యుడు తెలిపాడు. కాగా ఇదే ఆస్పత్రిలో డిసెంబర్‌ నెలలోనే ఇప్పటివరకు 77 మంది చిన్నారులు మరణించడం గమనార్హం.

Also Read: పూజారి బరితెగింపు.. మైనర్ బాలికపై అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.