యాప్నగరం

గుడికి వెళ్తున్న మహిళపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి సోషల్ మీడియాలో

ఆలయానికి వెళ్తున్న మహిళపై అత్యారానికి ఒడిగట్టిన ఐదుగురు యువకులు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన నిందితులు. తొమ్మిది రోజుల తర్వత బయటపడిన ఘటన.

Samayam Telugu 4 Jun 2019, 9:11 am
ఎన్ని చట్టాలొచ్చినా అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. రోజుకో ఘటన ఎక్కడో చోట బయటపడుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌లోనూ కామాంధులు రెచ్చిపోయారు. ఆలయానికి వెళుతున్న మహిళను అడ్డగించిన ఐదుగురు యువకులు.. అత్యాచారానికి ఒడిగట్టారు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మే 26న ఘటన జరగ్గా ఆలస్యంగా బయటపడింది.
Samayam Telugu rape


బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల మేరకు.. గత నెల 26న పాలి జిల్లాలో ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి ఆలయానికి బయల్దేరింది. దారి మధ్యలో ఐదుగురు యువకులు మహిళను అడ్డగించారు. ఆమెను పట్టుకొని బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. అక్కడ ఐదుగురు యువకులు మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు.. అంతటితో ఆగలేదు.

మహిళ అత్యాచారానికి పాల్పడుతూ వీడియో తీశారు. ఆ వీడియోను తీసుకెళ్లి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదురుగు నిందితుల్లో నలుగుర్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.