యాప్నగరం

అత్తింటి వారి అరాచకం.. నగ్నంగా పోలీస్ స్టేషన్‌కెళ్లిన బాధితురాలు

భర్త వేరే రాష్ట్రంలో పని చేస్తున్నాడు. అత్త, ఆడపడుచు వేధింపులు ఎక్కువయ్యాయి. గత ఆదివారం వారిద్దరూ తన దుస్తులు చింపేశారు. దీంతో బాధితురాలు నగ్నంగా పోలీసులను ఆశ్రయించింది.

Samayam Telugu 13 May 2019, 5:16 pm

ప్రధానాంశాలు:

  • భర్త వేరే రాష్ట్రంలో పని చేస్తున్నాడు. అత్త, ఆడపడుచు వేధింపులు ఎక్కువయ్యాయి.
  • గత ఆదివారం వారిద్దరూ తన దుస్తులు చింపేశారు.
  • దీంతో బాధితురాలు నగ్నంగా పోలీసులను ఆశ్రయించింది.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu woman crying1
అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ నగ్నంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చురూలో చోటు చేసుకుంది. భర్త పరాయి రాష్ట్రంలో పని చేస్తుండటంతో.. అత్త, ఆడపడుచు పదే పదే వేధింపులకు గురి చేసే వారు.. ఈ క్రమంలోనే ఆదివారం ఆమె దుస్తులను చింపేశారు. ఇక వారి ఆగడాలను భరించలేకపోయిన ఆమె.. నగ్నంగానే పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది. ఆమె రోడ్డుమీద దిగంబరంగా నడుచుకుంటూ వెళ్తుంటే.. దారిన పోయేవారు ఆమెకు సాయం చేయాల్సి పోయి.. మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీయడం బాధాకరం.
చురూ జిల్లా బిదసర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త అసోంలో కూలీ పనులు చేస్తుంటాడని, ఆయన ఇంట్లోలేని సమయంలో అత్త, ఆడపడుచు తనను వేధిస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఆగడాలను భరించలేకే ఇలా పోలీస్ స్టేషన్‌కు వచ్చానంది. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది.

‘బాధితురాలు దుస్తులు లేకుండా పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా కొందరు ఫొటోలు తీశారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నాం. ఆ ఫొటోలు ఏవైనా సోషల్ మీడియాలో వైరల్ అయితే సంబంధికులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని సుజన్‌గఢ్ ఏఎస్పీ సీతారామ్ మహిచ్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.