ఎన్నారై, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. నిందితులను మూడురోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న తెలంగాణ పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. జయరాం హత్యకు వారంరోజుల ముందుగానే రాకేశ్ స్కెచ్ వేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను హత్య చేస్తున్నట్లు రాకేశ్ నలుగురికి ముందే చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీణ అనే మహిళ పేరుతో రాకేశ్ జయరాంతో చాట్ చేసిన తన దగ్గరికి రప్పించుకున్నట్లు గతంలో పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే దస్పల్లా హోటల్ వద్ద జయరాంను కారులో ఎక్కించుకుని రాకేశ్ దగ్గరికి తీసుకెళ్లించి సినీ హాస్యనటుడు సూర్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను వీణ మేడమ్ డ్రైవర్ని అని సూర్య ఆయనతో చెప్పినట్లు సమాచారం.
జయరాంను హత్య చేస్తే ఆయన ఆస్తులన్నీ తనకే వస్తాయన్న దురుద్దేశంతోనే రాకేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. జయరాంను హత్య చేసిన సమయంలో రౌడీషీటర్ నగేష్ అక్కడే ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో తాము సేకరించిన విషయాలను పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించనున్నారు. మరోవైపు జయరాం హత్యకేసుతో తనకెలాంటి సంబంధం లేదని సినీనటుడు సూర్య చెబుతున్నాడు. రాకేశ్తో తనకు సంబంధాలు అంటగట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్నాడు.
జయరాంను హత్య చేస్తే ఆయన ఆస్తులన్నీ తనకే వస్తాయన్న దురుద్దేశంతోనే రాకేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. జయరాంను హత్య చేసిన సమయంలో రౌడీషీటర్ నగేష్ అక్కడే ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో తాము సేకరించిన విషయాలను పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించనున్నారు. మరోవైపు జయరాం హత్యకేసుతో తనకెలాంటి సంబంధం లేదని సినీనటుడు సూర్య చెబుతున్నాడు. రాకేశ్తో తనకు సంబంధాలు అంటగట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్నాడు.