యాప్నగరం

పోలీసుల నుంచి తప్పించుకున్న రేపిస్ట్.. లారీ కింద పడి దుర్మరణం

పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుండగా తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన అత్యాచార నిందితుడు ప్రమాదవశాత్తూ లారీ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 14 Jul 2020, 10:20 am
అత్యాచార కేసులో పోలీసులకు చిక్కిన నిందితుడు వారి నుంచి తప్పించుకునే క్రమంలో కంటైనర్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒడిశాలోని రాయగడలో చోటుచేసుకుంది. సంతోష్‌ కుమార్‌ పాండు అనే యువకుడిపై ఈ నెల 11న టికిరి పోలీస్‌‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదైంది. పోలీసులు అతడి కోసం గాలించి ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం నిందితుడిని రాయగడ తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షల కోసమని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.
Samayam Telugu Image


Also Read: కుమార్తెకి కరోనా పాజిటివ్.. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న తల్లి ఆత్మహత్య

అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా సంతోష్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వాహనంలో నుంచి దూకి పారిపోతూ అటుగా వెళ్తున్న భారీ కంటైనర్ కింద ప్రమాదవశాత్తూ పడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల సమాచారంతో ఫోరెన్సిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు తప్పించుకోబోయి చనిపోయాడా? లేక ఉద్దేశపూర్వకంగానే లారీ చక్రాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు.

Also Read: ప్రేమ పేరుతో మోసం.. పెళ్లికి ముందే గర్భం.. యువకుడి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.