యాప్నగరం

వివాహితపై కామం... ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడిన జిల్లా కలెక్టర్

తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి జంగజీర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ తనపై ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 4 Jun 2020, 8:50 am
జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి కలెక్టరేట్‌లోనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్న తన భర్తను డిస్మిస్ చేస్తానని బెదిరించి జంగజీర్ చాంఫ్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన జనక్ ప్రసాద్ పాథక్ తనను ఛాంబర్‌కు పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ మహిళ(33) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
IAS Officer raped on woman


Also Read: కీచక పోలీస్.. అర్ధరాత్రి ఒంటరి మహిళపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం

కొన్నాళ్లుగా కలెక్టర్‌ తనకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని, మే 15వ తేదీన తన ఛాంబర్‌కు పిలిపించి అత్యాచారం చేశారని జిల్లా ఎస్పీ పారుల్ మాధూర్‌కు ఇచ్చి ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మెసేజ్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఎస్పీకి అందజేసింది. దీంతో పోలీసులు జనక్ ప్రసాద్‌పై ఐపీసీ 376, 506, 509(బి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పుల్లల కోసం వెళ్లిన పదేళ్ల బాలికపై రేప్.. ప్రకాశం జిల్లాలో దారుణం

జనక్ ప్రసాద్ పాథక్‌ను ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా మే 26వ తేదీన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదని, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలపై జనక్ ప్రసాద్ ఇంకా స్పందించలేదు. ఆయన నిజంగానే అత్యాచారం చేశారా? బాధితురాలు చెబుతున్నది నిజమేనా? కాదా? అన్నది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.

Also Read: స్నానం చేస్తుండగా వీడియో తీసి బాలికపై రేప్.. గర్భం దాల్చిన బాధితురాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.