యాప్నగరం

Shocking: రేప్ కేసు నిందితుడు చనిపోయాడని.. బాధితురాలి సూసైడ్

పెళ్లి పేరుతో నమ్మించి తనపై అత్యాచారం చేసిన కానిస్టేబుల్‌కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 13 Nov 2020, 3:16 pm
రేప్ కేసు నిందితుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెలిసి బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిన షాకింగ్ ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్‌ సమీపంలోని డిబియాపురాకి చెందిన మహిళకు ఏతవాకి చెందిన వ్యక్తితో వివాహమైంది. కొద్దికాలం కిందట భర్త మరణించడంతో ఔరియాలోని ఆమె పుట్టింటికి తిరిగి వచ్చేసింది. స్థానిక బ్రహ్మనగర్‌ ఏరియాలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. ఆమెకి దేవ్‌కలి పోలీస్ పోస్టులో పనిచేస్తున్న కానిస్టేబుల్ జితేంద్ర పరిచయమైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


పెళ్లి చేసుకుంటానని నమ్మించిన జితేంద్ర ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. మోజు తీరాక ముఖం చాటేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరుతో లొంగదీసుకుని తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. జితేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసు ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతన్ని సస్పెండ్ చేశారు. కేసు విచారణలో ఉంది.

Also Read:
నదిలో తల్లీకూతుళ్లు.. బావిలో తండ్రి.. ఆసిఫాబాద్‌లో కలకలం

ఈ క్రమంలో ఫతేనగర్‌కి చెందిన జితేంద్ర బైక్‌పై సొంతూరు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఆ విషయం తెలుసుకున్న రేప్ బాధితురాలు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేప్ కేసు నిందితుడి మరణం, బాధితురాలి ఆత్మహత్య స్థానికంగా చర్యనీయాంశమైంది.

Read Also: చేయని తప్పుకి బలైపోయిన తల్లీకొడుకులు.. రోడ్డు మీదకి రావడమే నేరమా.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.