యాప్నగరం

విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కిడ్నాప్‌, రూ.5కోట్లు డిమాండ్

రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు రూ.5కోట్లు ఇవ్వాలని అతడి భార్యకు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేష్‌ను వదిలేసి పరారయ్యారు.

Samayam Telugu 7 Jul 2020, 12:26 pm
విశాఖ నగరంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌కు గురికావడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి అతడిని దుండగులు అపహరించినట్లు కుటుంబసభ్యులు ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డాబా గార్డెన్‌కు చెందిన సురేశ్‌కుమార్‌ ఆదివారం రాత్రి తన ఫ్రెండ్‌తో కలిసి దొండపర్తి ప్లైఓవర్‌ బ్రిడ్జి కూర్చుని ఉండగా కారులో వచ్చిన దుండగులు కత్తులు, తుపాకీతో బెదిరించి ఎత్తుకెళ్లారు. తమకు రూ.5 కోట్లు ఇస్తే విడిచిపెడతామని అతడి భార్యకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పాటు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu Image


Also Read: టెక్కీ లావణ్య ఆత్మహత్య కేసు.. ప్రకాశం జిల్లాలో ముగ్గురి అరెస్ట్

దీంతో కంగారుపడిన సురేష్ భార్య వైజాగ్ ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ విషయం పోలీసులకు చేరిందని తెలుసుకున్న కిడ్నాపర్లు సురేష్‌ను వదిలేసి కారులో పరారయ్యారు. పోలీసులు వారిని వెంబడించడంతో యలమంచిలి సమీపంలో కారును వదిలేసి వెళ్లిపోయారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై వైజాగ్ సీటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా స్పందిస్తూ.. ఆస్తి తగాదాలతో సురేష్‌ను కిడ్నాప్ చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. కిడ్నాపర్ల కోసం సీఐ ప్రేమ్‌కుమార్‌, ఎస్‌ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ గాలిస్తోందని తెలిపారు.

Also Read: అల్లుడిపై అత్తమామల ఫిర్యాదు.. 40రోజుల తర్వాత గర్భిణి మృతదేహానికి పోస్టుమార్టం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.