యాప్నగరం

రాత్రయితే రక్తపిశాచిలా మారతాడు.. వనపర్తి జిల్లాలో వింత మనిషి

వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి రక్తపిశాచిలా మారి ప్రజలను వణికిస్తున్నాడు. రాత్రివేళ గ్రామంలోని గొర్రెలు, మేకలను అపహరించి వారి రక్త తాగేస్తున్నాడు. దీంతో అతడిని చూస్తేనే గ్రామస్థులు భయపడుతున్నారు.

Samayam Telugu 4 Oct 2019, 11:36 am
తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని ఓ వ్యక్తి తన వింత ప్రవర్తనతో అందరినీ భయపెడుతున్నాడు. పగటిపూట గ్రామస్థులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి రాత్రయితే రక్తపిశాచిలా మారిపోతున్నాడు. గ్రామంలోని మూగజీవాలను ఎత్తుకెళ్లి బతికుండగానే కొరికి రక్తం తాగేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అతడి ప్రవర్తన జిల్లాలో హాట్‌టాపిక్‌ మారింది.
Samayam Telugu bloods


Also Read: అమెరికాలో అరాచకం.. మహిళపై అత్యాచారానికి పాల్పడిన మరో మహిళ

వనపర్తి జిల్లా సింగంపేట గ్రామానికి చెందిన కమ్మరి రాజు అనే వ్యక్తి పగలంతా గ్రామంలో మామూలుగా తిరుగుతుంటాడు. రాత్రయితే రక్తపిశాచిలా మారి గొర్రెలు, మేకలను ఎత్తుకెళ్లి వాటి రక్తం తాగేస్తుంటాడు. ఉదయాన్నే వాటిని యజమాని ఇంటి దగ్గర పడేస్తాడు. ఈ విధంగా రాజు ఇప్పటివరకు 60 మేకలు, గొర్రెలను చంపి రక్తం తాగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. రాజు పదో తరగతి వరకు చదివి కూలి పనులు చేసుకుంటున్నాడని, అందరితో కలివిడిగా ఉండే అతడికి రక్తం తాగే అలవాటు ఎలా వచ్చిందో తెలీదని కుటుంబసభ్యులు, గ్రామస్థులు చెబుతున్నారు.

Also Read: తండ్రిపై పగతో కూతురిపై హత్యాచారం.. నిందితుడిని పట్టించిన చెప్పు

రాజు వ్యవహారంపై బాధితులు ఇప్పటికే ఎన్నో పంచాయతీలు పెట్టి జరిమానాలు వసూలు చేసినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. మూగజీవుల రక్తం మరిగిన ఆ మనిషి పిల్లలను కూడా తీసుకుపోయి చంపేస్తాడేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రాజును మానసిక వైద్యశాలకు పంపించి వైద్యం చేయించేలా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి తీర్మానం చేశారు.

Also Read: కోడలికి షాకిచ్చిన కోర్టు.. అత్తపై దాడి కేసులో ఆర్నెల్ల జైలుశిక్ష

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.