యాప్నగరం

నిజామాబాద్: పోలీస్‌పై దాడి చేసి తుపాకీతో పరారైన ఖైదీ.. అనారోగ్యం పేరుతో!

Nizamabad: ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసి ఓ ఖైదీ పరారయ్యాడు. తుపాకీతో ఉడాయించాడు. అనారోగ్యానికి గురైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 5 Apr 2020, 9:51 am
పోలీసులపై దాడి చేసి తుపాకీతో పాటు పరారయ్యాడు ఓ రిమాండ్ ఖైదీ. అనారోగ్యానికి గురైన ఆ ఖైదీని ఆస్పత్రికి తరలిస్తుండగా ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి చేసి తప్పించుకున్నాడు. నిజామాబాద్‌‌ పట్టణంలో శనివారం (ఏప్రిల్ 4) రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌ గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కోర్టు ఇతడికి జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు అతడిని సారంగపూర్ జైలుకు తరలించారు.
Samayam Telugu prisoner


జైల్లో ఉన్న నిందితుడు అనారోగ్యానికి గురైనట్లు చెప్పడంతో పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి తిరిగొస్తున్న క్రమంలో నిందితుడు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ (షార్ట్ వెపన్)తో ప్రసాద్ పారిపోయాడు. అతడి కోసా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Also Read: ఈ టన్నెల్ నుంచి నడిచొస్తే కరోనా సహా క్రిములన్నీ ఖతం.. డీజీపీ ఆఫీస్‌లో కొత్త టెక్నాలజీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.