యాప్నగరం

‘చిత్తూరు’లో ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురి మృతి, పదుల్లో క్షతగాత్రులు

చిత్తూరు జిల్లా కంపల్లెలో సిద్ధేశ్వరస్వామిని దర్శించుకుని భక్తులు వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, కనీసం 10 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Samayam Telugu 1 Jan 2020, 7:03 pm
నూతన సంవత్సరం వేళ రాష్ట్రంలోని రహదారులపై రక్తపుటేరులు పారాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కంపల్లెలో విషాదం చోటుచేసుకుంది. సిద్ధేశ్వరస్వామి కొండ వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందగా.. 10 మందికి పైగా గాయపడ్డారు. జిల్లాలోని మెదలపల్లి, బొడ్డుపల్లి గ్రామాలకు చెందిన ‘ఓం శక్తి’ మాల వేసుకున్న భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా సిద్ధేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
Samayam Telugu accident


అనంతరం ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ట్రాక్టర్‌లో ఎక్కువ మంది ఎక్కడంతో ఒక్కసారిగా బ్రేక్ ఫెయిలయింది. దీంతో కొండ వద్ద ట్రాక్టర్ బోల్తా పడగా.. ఒకరిపై మరొకరు కుప్పలుగా పడ్డారు. ఈ నేపథ్యంలో ఊపిరి ఆడక ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలిసింది.

సిద్ధేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న భక్తులు ట్రాక్టర్ బోల్తా పడటాన్ని గమనించి.. వెంటనే 108కి సమాచారం అందించారు. అలాగే సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డవారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.