యాప్నగరం

వరంగల్‌లో బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు యువకులు దుర్మరణం

ముగ్గురు యువకులు బైక్‌పై గంగదేవిపల్లికి వెళ్తుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 14 Feb 2020, 12:39 pm
వరంగల్‌ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ల జగదీశ్‌(19), న్యాల నవీన్‌(20), జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్‌సింగ్‌ తండాకు చెందిన లకావత్‌ గణేష్‌(21) ముగ్గురు గురువారం రాత్రి బైక్‌పై గంగదేవిపల్లికి వెళ్తున్నారు.
Samayam Telugu pjimage (4)


Also Read: కర్నూలులో దారుణం.. నైట్ క్లాసుల పేరుతో అబ్బాయిలపై టీచర్ల లైంగిక దాడి

కాసేపట్లో గంగదేవిపల్లికి చేరుకుంటారనగా వీరి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో గంగదేవిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జగదీశ్, నవీన్ కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. చేతికి అందివచ్చిన కొడుకులు విగతజీవులుగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం.. తూ.గో. జిల్లా యువకుడి దుర్మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.