యాప్నగరం

యాదాద్రి భువనగిరిలో ప్రమాదం.. రెండు గంటలు నరకం

యాదగిరిగుట్ట వైపు నుంచి వస్తున్న డీసీఎం లారీ ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Samayam Telugu 23 Aug 2020, 4:49 pm
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, డీసీఎం లారీ ఢీకొనడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అతికష్మమ్మీద క్షతగాత్రులను రెండుగంటల తర్వాత వాహనంలో నుంచి బయటకు తీసుకురాగలిగారు. అప్పటి వరకూ వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ నరకయాతన అనుభవించాడు. యాదగిరిగుట్ట నుంచి చిట్యాల వైపు వస్తున్న డీసీఎం.. చిట్యాల వైపు నుంచి యాదగిరి గుట్ట వైపు వస్తున్న కారు రామన్నపేట శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


ప్రమాద ధాటికి వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు, డీసీఎం డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్లీనర్ వాహనం నుంచి బయపడగా డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయాడు. రెండు గంటలసేపు నరకయాతన అనుభవించాడు. పోలీసులు స్పందించి జేసీబీని తెప్పించి అతికష్టమ్మీద డ్రైవర్‌ని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఇంటి ఓనర్ భార్యపై రేప్.. ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి..


Read Also: తల్లీకూతుళ్ల రహస్య శృంగారం.. ఒకే ప్రియుడితో.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.