విజయవాడ నగరంలో దోపిడీ దొంగలకు నిలయంగా మారుతోంది. రాష్ట్ర అధికార కేంద్రంగా విరాజిల్లుతున్న విజయవాడలో ఇటీవల కాలంలో తరుచూ దోపిడీలు, దొంగతనాలు జరుగుతుండగా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శనివారం అర్ధరాత్రి జరిగిన దోపిడీ నగరంలో మరోసారి కలకలం సృష్టించింది.
ఈ ఘటనలో గోడౌన్ సిబ్బంది గాయపడ్డారు. క్యాషియర్ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమౌంది. దీంతో మిగతా సిబ్బంది అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గోడౌన్కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు. నగరంలో వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.