యాప్నగరం

మాటువేసి రౌడీషీటర్‌ని తెగనరికిన దుండగులు.. నాగర్‌కర్నూల్‌లో దారుణం

రాత్రి సమయంలో మాసయ్య ఇంటి నుంచి బయటికొచ్చాడు. అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు జనం తిరుగుతుండగానే ఒక్కసారిగా దాడి చేసి హతమార్చారు.

Samayam Telugu 2 Aug 2020, 7:34 pm
నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మాటువేసి రౌడీషీటర్‌ని కిరాతకంగా చంపేశారు. తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రౌడీషీటర్ మాసయ్య(40) రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దుండగులు మాసయ్యని వెంబడించి సరిగ్గా గ్రామం నడిబొడ్డున దాడి చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


వేటకత్తులతో విచక్షణా రహితంగా నరికేశారు. ఒక్కసారిగా దాడి చేసి కిరాతకంగా నరికి చంపేశారు. మాసయ్య రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. రౌడీషీటర్ హత్యతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న తిమ్మాజిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే ప్రత్యర్థులు అంతమొందించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:
ఆ సెక్స్ కోసం పిచ్చెక్కిపోయిన భర్త.. భరించలేని భార్య.. ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.