యాప్నగరం

రాజమండ్రిలో రౌడీషీటర్ దారుణహత్య.. తలపై బండరాళ్లతో దారుణంగా కొట్టి

రౌడీషీటర్ హత్యతో రాజమహేంద్రవరం ఉలిక్కిపడింది. బుధవారం తెల్లవారుజామున అద్దేపల్లి సతీశ్ అనే రౌడీషీటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు.

Samayam Telugu 21 May 2020, 8:04 am
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ హత్య తీవ్ర కలకలం రేపింది. రాజమహేంద్రవరంలోని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో గల క్వారీ మార్కెట్ సమీపంలోని టీవీ రోడ్డులో బుధవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడిని ఆర్యాపురానికి చెందిన రౌడీ షీటర్‌ అద్దేపల్లి సతీష్‌(42)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu రౌడీషీటర్ సతీశ్


Also Read: భర్తపై అలిగి వెళ్లిపోయిన మహిళ.. రెండ్రోజులకే ఊరి చివర శవమై..

సతీష్‌‌ను బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాళ్లతో బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ సంతోష్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే సతీష్‌తో శత్రుత్వం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: ఆంటీతో యువకుడి అఫైర్.. ఆమె భర్త, మరిది చేతిలో దారుణంగా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.