యాప్నగరం

కాకినాడలో ఆర్టీసీ డ్రైవర్ అరాచకం.. భార్యని డంబెల్‌తో బాదేసి.. కన్నకూతుళ్లతో నీచంగా..

మద్యానికి బానిసైన శ్రీను నిత్యం భార్యతో గొడవపడేవాడు. మరోమారు గొడవపెట్టుకుని డంబెల్‌తో తల పగలకొట్టాడు. కూతుళ్లను కూడా అసభ్యంగా తిడుతూ వేధింపులకు గురిచేసేవాడని భార్య మాధవి వాపోయారు.

Samayam Telugu 10 Sep 2020, 7:06 pm
తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ అరాచకం సృష్టించాడు. కాకినాడ మండలం కొవ్వూరుకు చెందిన డి.శ్రీను భార్యతో గొడవపడి డంబెల్‌తో తల బద్దలుకొట్టాడు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. కూతుళ్లు వీడియో తీస్తున్నా ఏ మాత్రం భయపడకుండా అవసరమైతే డయల్ 100కి ఫోన్ చేసుకోమంటూ రెచ్చిపోయాడు. ఈ దాడిలో భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి. ఆమె తల పగిలింది. వెంటనే బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. తీవ్రగాయాలపాలైన భార్య మాధవి భర్త సైకోయిజాని ఏకరవు పెట్టింది.
Samayam Telugu డంబెల్‌తో కొడుతున్న భర్త, గాయాలతో బాధితురాలు
harassment


పెళ్లైనప్పటి నుంచి నిత్యం నరకం చూపిస్తున్నాడని.. కన్నకూతుళ్లతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె వాపోయింది. బూతులు తిడుతూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దినెలల కిందట భార్యపై కత్తితో హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. అదే విషయమై గతంలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో భార్య మాధవి కేసు పెట్టింది.

Also Read: బిడ్డను పుట్టిస్తానన్న బాబా.. కోడలిని గదిలోకి తీసుకెళ్లి..

తనను చంపేసి మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. అందుకే తన కూతుళ్లతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాపోయింది. తన భర్తకు ఓ అధికార పార్టీ నేత అండ ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం నిందితుడు శ్రీను పరారీలో ఉన్నట్లు సమాచారం.

Read Also: ఆవారా అల్లుడికి అత్త ఆశ్రయం.. చివరికి.. వరంగల్‌లో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.