యాప్నగరం

‘వాడి కోరికలు తీర్చలేక చచ్చిపోతున్నా’.. కోనసీమ యువతి సూసైడ్‌ నోట్‌లో షాకింగ్ విషయాలు

ఈ నెల 12న సఖనేటిపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో పోలీసులు సూసైడ్ నోట్ విడుదల చేశారు. ఓ యువకుడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది.

Samayam Telugu 23 Feb 2020, 10:22 am
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 12న ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. యువతి సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విషయాలతో ఈ కేసును ఓ కొలిక్కి తెస్తున్నారు. ఓ యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు... చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖను పోలీసులు శనివారం బయటపెట్టారు.
Samayam Telugu images


Also Read: ఇద్దరు పిల్లల తల్లిపై కండక్టర్ కామం... కోరిక తీర్చలేదని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి

‘అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు.. నాకు బతకాలని ఉన్నా వాడు బతకనివ్వట్లేదు.. తన రూమ్‌కి వచ్చి కోరికలు తీర్చాలని వేధిస్తున్నాడు. మాట వినకపోతే ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేక చచ్చిపోతున్నా. వాడిని ఏమీ చేయొద్దు. ఆ ఫోటోలు బయటపెడితేనే నా ఆత్మకు శాంతి. ఐ మిస్ యూ అమ్మా’ అంటూ యువతి లేఖలో పేర్కొంది.

Also Read: టిక్‌టాక్‌ ఫ్రెండ్‌తో వివాహిత అఫైర్.. భర్త లేని సమయంలో బెడ్రూమ్‌లో దూరి రాసలీలలు

ఈ లేఖ ఆధారంగా పోలీసులు కేసు చేధించే పనిలో పడ్డారు. తనను వేధిస్తున్న యువకుడు ఎవరో యువతి లేఖలో చెప్పకపోవడంతో అతడిని గుర్తించడం కష్టంగా మారింది. అయినప్పటికీ వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేస్తామని ఎస్ఐ సురేశ్ తెలిపారు. యువతి చావుకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Also Read: ఇద్దరు బిడ్డలను చంపి ఉరేసుకున్న తల్లి.. నెల్లూరులో విషాద ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.