యాప్నగరం

టీచర్ల టాయిలెట్‌లో సీక్రెట్ కెమెరాలు.. ఆ వీడియోలు చూపించి..

స్కూల్ సెక్రటరీ, అతని కొడుకు లేడీ టీచర్లతో అనుచితంగా ప్రవర్తించారు. టాయిలెట్లలో సీక్రెట్ కెమెరాలతో అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారు.

Samayam Telugu 22 Sep 2020, 2:43 pm
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారితప్పారు. సాటి మహిళా ఉపాధ్యాయులతో నీచానికి దిగారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ అత్యంత దిగజారి ప్రవర్తించారు. కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన లేడీ టీచర్లు జీతం ఇవ్వమని అడిగినందుకు కీచకపర్వం సృష్టించారు. టీచర్ల టాయిలెట్‌ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కి దిగారు. తమ కోరిక తీర్చాలంటూ స్కూల్ సెక్రటరీ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
secret cameras


నగరంలోని సర్దార్ బజార్ రిషబ్ అకాడమీ స్కూల్ సెక్రటరీ రంజిత్ జైన్, అతని కొడుకు అభినవ్‌ జైన్ నీచానికి పాల్పడ్డారు. కరోనా కారణంగా స్కూల్ మూతపడి జీతాల్లేక అల్లాడుతున్న లేడీ టీచర్లపై అకృత్యాలకు ఒడిగట్టారు. జీతాలు చెల్లించాలని అడిగినందుకు టీచర్ల టాయిలెట్‌లలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. టీచర్ల ప్రైవేట్ దృశ్యాలను షూట్ చేసి నీచంగా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: ప్రియుడితో కూతురి ఎఫైర్ తెలిసి.. గర్భవతిని చేసిన తండ్రి.. నీచం

జీతం అడిగిన టీచర్‌ని పిలిపించి ఆమె వీడియోలు చూపించి వేధించడం మొదలుపెట్టారు. తమతో చనువుగా ఉండాలంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఇబ్బందులకు గురిచేశారు. దీంతో విసిగిపోయిన టీచర్లు స్కూల్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక పోలీసులను ఆశ్రయించారు. టాయిలెట్ వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తమతో చనువుగా ఉండాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని లేడీ టీచర్లు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Read Also: పప్పుగుత్తితో భర్తని చంపిన భార్య.. అనంతపురంలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.