యాప్నగరం

ఆయన లేని లోకంలో ఉండలేను.. హైస్కూల్ టీచర్ సూసైడ్.. చిత్తూరులో విషాదం

భర్త అడుగుజాడల్లో నడిచిన భార్య మరణంలోనూ ఆయన వెంటే సాగింది. భర్త లేని లోకంలో తను ఉండలేనంటూ ఆత్మహత్యకు పాల్పడింది.

Samayam Telugu 23 Jan 2020, 8:09 pm
భర్త అనురాగాన్ని మరువలేక.. ఆయన లేని లోకంలో ఉండలేక.. భార్య కూడా బలవంతంగా తనువు చాలించిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. భర్త హఠాన్మరణంతో కుంగిపోయిన భార్య తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. యాసిడ్ తాగేసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu suicide 2


జిల్లాలోని తవణంపల్లె మండలం అరగొండకు చెందిన దొరైరాజ్ నిన్న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. భర్త మరణవార్త తెలియగానే భార్య షర్మిల గుండెపగిలిపోయింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె తను కూడా తనువు చాలించాలని నిర్ణయించుకుని యాసిడ్ తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వేలూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

Also Read: విద్యార్థినిని ఇంట్లో బంధించి అత్యాచారం.. తూర్పు గోదావరిలో కీచక వార్డెన్

షర్మిల యాదమర్రి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. భర్త మరణంతో కుంగిపోయిన ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. దొరైరాజ్ మరణం.. షర్మిల ఆత్మహత్యతో అరగొండ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. భార్యాభర్తల మరణం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Read Also: మమ్మల్ని సుఖపెడితేనే నీకు ఉద్యోగం.. ఆ కోరిక తీర్చాలంటూ మహిళా ఉద్యోగికి వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.