యాప్నగరం

నడిరోడ్డుపై వృద్ధురాలి మృతదేహం.. ఆమె నగలు టాయిలెట్ సీటు కింద..

ఎనభై ఏళ్ల మహిళను హత్య చేసి దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. నగల కోసమే దారుణంగా చంపేసినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

Samayam Telugu 30 Jan 2020, 9:57 pm
వృద్ధురాలిని కర్కశంగా చంపేసి నగలు దోచుకున్న దారుణ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వృద్ధురాలి ఇంటికి సమీపంలో ఉండే వ్యక్తే ఆమెపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్లాడు . ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో వృద్ధురాలిని హత్య చేసి నగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోవడం స్థానికులను కలచివేసింది.
Samayam Telugu murder.


ఎనభై ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా చంపేసి నగలు దోచుకెళ్లిన ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. బాలమణి అనే వృద్ధురాలిని ఆమె పొరుగున నివాసం ఉంటున్న సెక్యూరిటీ గార్డు కల్యాంకర్ భవంజీ హత్య చేసి బంగారం దోచుకెళ్లాడు. ఆమె తల్లిని పలకరించేందుకు ఇంటికి వచ్చిన బాలమణిని భవంజీ వెనక నుంచి బలంగా నెట్టేయడంతో కిందపడి తీవ్రగాయాలయ్యాయి.

Also Read: ఒకే బైక్‌పై ముస్లిం అమ్మాయి, క్రిస్టియన్ అబ్బాయి.. బంధించి నరకం చూపిన దుండగులు

అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకునేందుకు యత్నించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమెను దారుణంగా హత్య చేసి నగలు లాక్కెళ్లాడు. మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేయడంతో ఉదయాన్నే స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి మేనల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.

Read Also:
అమ్మాయిలను ట్రాప్ చేసి బెడ్రూమ్‌కి.. ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో..

విచారణ ప్రారంభించిన పోలీసులు పొరుగున ఉండే భవంజీని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. బాలమణిని తానే హత్య చేసి.. నగలు దోచుకున్నట్లు అంగీకరించాడు. ఇంట్లోని టాయిలెట్ సీటు కింద దోచుకున్న నగలను భద్రంగా దాచిపెట్టినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.