యాప్నగరం

కత్తులతో నరికి, కారుతో ఢీకొట్టి.. ఫ్రెండ్స్ చేతిలో వ్యాపారి దారుణహత్య

ఓ విత్తన కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తూ సొంతంగా వ్యాపారం చేస్తున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి శనివారం ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళ్లాడు. ఓ చెట్టు వద్ద మద్యం తాగుతున్న సమయంలో వారి మధ్య గొడవ జరిగింది.

Samayam Telugu 24 May 2020, 4:57 pm
తోటి మిత్రులే ఓ వ్యాపారిని అతి కిరాతకంగా చంపేసిన ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో జరిగింది. తొగుట మండలం చందాపూర్‌కు చంది ఉదయ్‌కుమార్‌రెడ్డి (35)ని స్నేహితులే కత్తితో దాడి చేసి, కారుతో ఢీకొట్టి చంపి ముళ్లపొదల్లో పడేశారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తూనే ఓ విత్తన కంపెనీలో పనిచేస్తూ, మరోవైపు సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. శనివారం ఉదయం కొంగరకలాన్‌ నుంచి ఉదయం కారులో మిత్రుడితో కలిసి వెళ్లి ఆలేరు మండలం కొలనుపాక వద్ద మరో మిత్రుడిని తీసుకుని చేర్యాలకు మధ్యాహ్నం వచ్చారు.
Samayam Telugu Image


Also Read: మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పు... హైదరాబాద్‌లో వ్యక్తి దురాగతం

హైవేపై వెళ్తూ లెనిన్‌నగర్‌ దాటిన తర్వాత ఓ చెట్టు కింద కూర్చొని మద్యం తాగారు. ఈ క్రమంలోనే ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు మిత్రులు ఉదయ్‌కుమార్‌రెడ్డిని కత్తులతో పొడిచారు. గాయాలతో అతడు హైవేపై పరుగు పెడుతుండగా కారుతో ఢీకొట్టారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని పక్కనే ముళ్ల పొదల్లో వేసి పరారయ్యారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఉదయ్‌కుమార్‌రెడ్డి సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబసభ్యులు ఆందోళన పడ్డారు. కాసేపటికే ఉదయ్‌కుమార్‌రెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం తెలిసి వారంతా షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: పెళ్లి పేరుతో లైంగిక వాంఛలు తీర్చుకుని.. బిడ్డకు పుట్టాక పరారైన ప్రియుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.