యాప్నగరం

Visakha: అరకు లోయలో విషాదం.. హైదరాబాద్ యువకుడి దుర్మరణం

అరకు లోయ అందాలను తన సెల్ఫీ కెమెరాలో బంధించేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో యువకుడు. ప్రమాదవశాత్తూ రాయిపై నుంచి పడిపోయి అక్కడికక్కడే..

Samayam Telugu 23 Aug 2020, 10:16 pm
సెల్ఫీ సరదా నిండుప్రాణాన్ని బలితీసుకుంది. బండరాయిపై నుంచి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించిన యువకుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. అరకులోయ అందాలు చూసేందుకు వచ్చిన హైదరాబాద్ యువకుడు అనంతగిరి తాటిగూడ జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. రాయిపై నిల్చుని సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ పడిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తాటిగూడ జలపాతం సమీపంలోని మరో జలపాతం వద్ద ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుడిని హైదరాబాద్‌కి చెందిన పువ్వుల రానా ప్రతాప్‌(22)గా గుర్తించారు. యూసుఫ్‌గూడ పరిధిలోని లక్ష్మీనరసింహ నగర్‌కి చెందిన రానా.. బీటెక్ ఫైనలియర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు స్నేహితులతో కలసి కారులో అరకు లోయ పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ప్రమాదవశాత్తూ రాయిపై నుంచి కిందపడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రాణాలు కోల్పోయిన యువకుడు
araku accident


Read Also: తల్లీకూతుళ్ల రహస్య శృంగారం.. ఒకే ప్రియుడితో.. చివరికి..

Also Read: కూతురికి, అల్లుడికి గొడవ.. అత్త వేలుపెట్టడంతో ఊహించని దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.