యాప్నగరం

Vijayawada: ప్రముఖ డాక్టర్ దారుణ హత్య.. ఆ పెద్దాయనకు శత్రువులెవరు.?

ప్రముఖ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఊరెళ్లిన సమయంలో అదను చూసి కిరాతకంగా అంతమొందించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 28 Nov 2020, 2:47 pm
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ వైద్యుడిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. డాక్టర్‌ని నట్టింట్లోనే అతి దారుణంగా నరికి చంపడం జిల్లాలో కలకలం రేపుతోంది. అవనిగడ్డకు చెందిన ప్రముఖ డాక్టర్ డా.కోట శ్రీహరిరావు(65) దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి ఇంటికి వెళ్లిన ఆయన తెల్లారేసరికి శవమై కనిపించారు. బెడ్రూమ్‌లో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో శ్రీహరిరావు ఒక్కరే ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా దుండగులు ఆయనపై దాడి చేసి చంపేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


ఇంట్లో సీసీ కెమెరాల పసిగట్టిన దుండగులు వాటికి చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను పైకి తిప్పేసి వాటికి చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆధారాల కోసం సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు వాటిని పైకి తిప్పేసినట్లు గుర్తించారు. డాక్టర్‌ హత్యకు గల కారణాలేంటి? ఆయనను చంపేంత శత్రువులున్నారా? వంటి విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలంలో డాక్టర్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also Read: ఫోన్ ఎత్తని భర్త.. నోరుజారి దొరికిపోయిన భార్య, శ్రీకాకుళంలో దారుణంRead Also: కోడళ్లు కూడా వచ్చాక దారితప్పిన మామ.! యాసిడ్ పోసిన అత్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.