యాప్నగరం

Ahmedabad ఘోర ప్రమాదం.. లిఫ్ట్ కూలి 8 మంది మృతి

నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 14 Sep 2022, 2:48 pm
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. గుజరాత్ విశ్వవిద్యాలయంలోని నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ కూలి ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి లిఫ్ట్‌లో ఎనిమిది మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Samayam Telugu అహ్మదాబాద్ లిఫ్ట్ ప్రమాదం


ఏడంతస్తుల భవనంపై కార్మికులు లిఫ్ట్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయిందని పేర్కొన్నారు. ఘటన గురించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. రక్షణపరమైన లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మరోవైపు, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.