యాప్నగరం

బెంగాలీ అమ్మాయిలతో వ్యభిచారం.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్

ఇతర రాష్ట్రాల అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్వాహకుడిని అరెస్ట్ చేసి.. ఇద్దరు అమ్మాయిలను రక్షించారు.

Samayam Telugu 22 Jul 2020, 11:04 am
కరోనా సమయంలోనూ హైదరాబాద్ నగరంలో వ్యభిచారం దందా యథేచ్చగా కొనసాగుతోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొందరు అక్రమార్కులు మహిళల శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు. తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ..శివకుమార్‌, కరీంనగర్‌కు చెందిన చిన్నా స్నేహితులు. వీరికి పశ్చిమ బెంగాల్‌, ముంబయి, ఇతర రాష్ట్రాల్లో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠాలతో పరిచయాలు ఉన్నాయి.
Samayam Telugu Image


Also Read: తెలంగాణ: స్నానం చేస్తుండగా వీడియో తీసి వివాహితపై లైంగిక దాడి

దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న వారిద్దరు వ్యభిచారం చేయించాలనుకున్నారు. ఉద్యోగాల పేరుతో బ్రోకర్ల సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇంట్లో ఉంచేవారు. అమ్మాయిల ఫోటోలను ఆన్‌లైన్లో పెట్టి విటులను ఆకర్షించేవారు. ఒక్కో కస్టమర్‌ నుంచి రూ. 5 వేల నుంచి 8 వేల వరకు వసూలు చేసి అమ్మాయిలను పంపించేవారు. ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు నేరేడ్‌మెట్‌లోని వాయుపురి కాలనీలో జరుగుతున్న సెక్స్‌ రాకెట్‌పై దాడులు నిర్వహించారు.

Also Read: చిత్తూరు: వేధింపుల తాళలేక భర్త హత్య.. కోడలికి సాయం చేసిన అత్త

ఈ సందర్భంగా నిర్వాహకుడు శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు యువతులను రక్షించారు. మరొక నిర్వాహకుడు చిన్నా పరారీలో ఉన్నాడు. శివకుమార్ నేరం అంగీకరించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: భార్య మరణాన్ని తట్టుకోలేక భర్మ ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న ఫేస్‌బుక్ ఫోస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.