భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. 19 మంది విటులు అరెస్ట్.. ఏపీ యువతులు సహా..
నగరంలోని మసాజ్ సెంటర్లు, వ్యభిచార గృహాలపై మూడు ప్రత్యేక పోలీసు టీమ్లు మెరుపు దాడులు చేశాయి. ఇండిపెండెంట్ హౌసులు, స్పా, మసాజ్ సెంటర్లపై దాడులు చేసి..
Samayam Telugu 23 Aug 2020, 8:46 pm
మసాజ్ సెంటర్ల పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసి భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. మూడు టీమ్లుగా ఏర్పడిన పోలీసు బృందాలు విడివిడిగా దాడులు నిర్వహించి వ్యభిచారం చేస్తున్న 19 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. 9 మంది అమ్మాయిలను వ్యభిచార కూపం నుంచి రక్షించి షెల్టర్ హోంకి తరలించారు. అమ్మాయిలన పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా తమిళనాడు పోలీసులు గుర్తించారు.
నగరంలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో తంజావూర్ ఎస్పీ దేశ్ముఖ్ శేఖర్ సంజయ్ ముగ్గురు ఎస్సైలతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీమ్లు నగరంలోని కావేరి నగర్, మూవేందర్ నగర్, మంగళాపురం, మునిసిపల్ కాలనీ, హెర్బల్ ఫామ్ ఏరియా తదితర ప్రదేశాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. మరికొన్ని చోట్ల మసాజ్ సెంటర్ల పేరుతో నిర్వహిస్తున్నట్లు గుర్తించి దాడులు నిర్వహించారు.
Also Read: కూతురికి, అల్లుడికి గొడవ.. అత్త వేలుపెట్టడంతో ఊహించని దారుణం
స్పా, మసాజ్ సర్వీసెస్ పేరుతో ఇళ్లు, షాపులు అద్దెలకు తీసుకుని వ్యభిచార దందా నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించారు. ఈ దాడుల్లో 19 మంది విటులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. భారీగా నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించి షెల్టర్ హోమ్కి తరలించారు. వారంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
Read Also: ఇంటి ఓనర్ భార్యపై రేప్.. ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి..
నగరంలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో తంజావూర్ ఎస్పీ దేశ్ముఖ్ శేఖర్ సంజయ్ ముగ్గురు ఎస్సైలతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీమ్లు నగరంలోని కావేరి నగర్, మూవేందర్ నగర్, మంగళాపురం, మునిసిపల్ కాలనీ, హెర్బల్ ఫామ్ ఏరియా తదితర ప్రదేశాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. మరికొన్ని చోట్ల మసాజ్ సెంటర్ల పేరుతో నిర్వహిస్తున్నట్లు గుర్తించి దాడులు నిర్వహించారు.
Also Read: కూతురికి, అల్లుడికి గొడవ.. అత్త వేలుపెట్టడంతో ఊహించని దారుణం
స్పా, మసాజ్ సర్వీసెస్ పేరుతో ఇళ్లు, షాపులు అద్దెలకు తీసుకుని వ్యభిచార దందా నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించారు. ఈ దాడుల్లో 19 మంది విటులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. భారీగా నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించి షెల్టర్ హోమ్కి తరలించారు. వారంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
Read Also: ఇంటి ఓనర్ భార్యపై రేప్.. ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి..