యాప్నగరం

మసాజ్‌ సెంటర్ పేరుతో వ్యభిచారం.. విజయవాడలో జోరుగా సెక్స్ దందా

పెనమలూరు మండలం యనమలకుదురు చెందిన మహిళ ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం చేయిస్తోంది.

Samayam Telugu 28 Jun 2020, 11:37 am
విజయవాడ నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మసాజ్ సెంటర్ పేరుతో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఇద్దరు విటులు, ఏడుగురు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకుని... వారి నుంచి 11 సెల్‌ఫోన్లు, ఓ కారు, రూ.75వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిని మాచవరం పోలీసులకు అప్పగించగా వారిని కోర్టులో హాజరుపరిచారు.
Samayam Telugu Image


Also Read: పెళ్లి పేరుతో బాలికపై రెండేళ్లుగా లైంగిక దాడి... 10 మందిపై కేసు

పెనమలూరు మండలం యనమలకుదురు చెందిన మహిళ, రామచంద్రరావునగర్‌కు చెందిన ఓ వ్యక్తితో కలిసి కొంతకాలంగా మాచవరం పోలీస్ స్టేషన్‌ పరిధిలోని మొగల్రాజపురంలో ఓ అపార్టుమెంటును అద్దెకు తీసుకుంది. అందులో బాడీ మసాజ్ సెంటర్‌ ఏర్పాటు చేసింది. ఇతర ప్రాంతాల నుంచి అందమైన యువతులను తీసుకొచ్చి వారి ఫోటోలను ఆన్‌లైన్లో ఉంచి విటులను ఆకర్షిస్తోంది.

Also Read: వదినతో అక్రమ సంబంధం.. సొంత అన్ననే చంపి పాతిపెట్టిన తమ్ముడు

తన అపార్ట్‌మెంట్ వచ్చిన వారికి అమ్మాయిలను సరఫరా చేస్తూ వ్యభిచారం దందా కొనసాగిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి రైడ్ చేసి నిర్వాహకురాలితో పాటు సెక్స్‌వర్కర్లు, విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార నిర్వాహకురాలిని 2018లోనూ ఇదే తరహా కేసులో మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: టెన్త్ క్లాస్‌లోనే కామ కలాపాలు.. తోటి విద్యార్థినిని గర్భవతిని చేసిన బాలుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.