యాప్నగరం

భర్త చనిపోయాక దారితప్పిన భార్య.. కొడుకుతో సహా.! ఘోరం

ఇటీవల జరిగిన అత్యంత ఘోరమైన ఘటనల్లో ఇదొకటి. మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. వావీవరసలు లేకుండా అత్యంత దారుణాలకు ఒడిగడుతున్నారు.

Samayam Telugu 15 Nov 2020, 6:14 pm
సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగుచూసింది. మానవ సంబంధాలు రోజురోజుకీ పతనమైపోతున్నాయనేందుకు నిదర్శనంగా నిలిచే అత్యంత జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది. భర్త చనిపోయాక దారితప్పిన భార్య కన్నకొడుకుతోనే శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ ఘోరం చేసి ఆగకుండా మరికొందరితో కూడా వివాహేతర సంబంధాలు నడిపింది. అవి తెలిసిపోవడంతో చివరికి కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ అత్యంత ఘోరమైన ఘటన కర్ణాటకలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


హవేరి జిల్లాలోని వనహళ్లికి చెందిన మహిళ భర్త గతేడాది మృతి చెందాడు. ఆ తరువాత భార్య అత్యంత నీచానికి ఒడిగట్టింది. కన్నకొడుకు(21)తో శారీరక సంబంధం పెట్టుకుంది. అతడికి కూడా తెలియకుండా మరికొందరితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగించింది. తీరా ఆ విషయం కొడుక్కి తెలిసిపోవడంతో అందరితో సంబంధాలు తెంచుకోవాలని.. తనొక్కడితోనే ఉండాలని ఆమెను హెచ్చరించాడు.

Read Also: హత్య చేసి.. శవాన్ని లారీలో వేసుకుని పోలీస్ స్టేషన్‌కి.. ఖమ్మంలో షాకింగ్

అయినా ఆమె పద్ధతిలో మార్పు రాకపోవడంతో కొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెపై అత్యాచారం చేసి మరీ దారుణంగా హతమార్చాడు. శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కి చివరికి కన్నకొడుకు చేతిలోనే హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరం అంగీకరించినట్లు సమాచారం.

Also Read: ప్రియురాలిని పొలాల్లోకి తీసుకెళ్లి.. దారుణం.. వీడిన వనపర్తి మర్డర్ మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.