యాప్నగరం

కావలి షకీల హత్య కేసులో షాకింగ్.. ప్రియుడే హంతకుడు!

కాపురంలో కలహాలు రావడంతో భర్తను వద్దనుకుంది. పిల్లలతో సహా పుట్టింటికి వచ్చేసింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు ప్రియుడే ఆమె పాలిట యముడయ్యాడు.

Samayam Telugu 28 Aug 2020, 5:08 pm
నెల్లూరు జిల్లా కావలిలో దారుణంగా హత్యకు గురైన షేక్ షకీల హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు పిల్లల తల్లైన షకీల పెళ్లి చేసుకోమనడంతో ప్రియుడే అమానుషంగా హత్య చేసి రోడ్డుపై పడేసినట్లు తెలుస్తోంది. అదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆవేశంలో గొంతునులిమి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు..
Samayam Telugu హత్యకు గురైన వివాహిత షకీల
kavali murder


పట్టణంలోని ఇస్లాంపేటకు చెందిన షేక్‌ షకీల(25)కి ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం తెట్టుకి చెందిన ఖాదర్‌బాషాతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. భర్తతో విభేదాలతో విడిపోయిన షకీల.. నాలుగేళ్లుగా ఇస్లాంపేటలోనే తన అక్క వద్ద ఉంటోంది. గతంలో ఆమె స్థానికంగా ఓ ప్లాస్టిక్ దుకాణంలో పనిచేసింది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన చికెన్ షాపులో పనిచేసే అక్తర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

Also Read: మహిళను చంపి నడిరోడ్డుపై పడేసిన దుండగులు.. నెల్లూరులో దారుణం

తరచూ ఇద్దరూ పుచ్చలపల్లి వారి వీధిలోని ఓ వృద్ధురాలి ఇంట్లో కలుసుకునేవారు. గత కొద్దికాలంగా తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిని షకీల ఒత్తిడి చేస్తోంది. వివాహితుడైన అక్తర్ పెళ్లి వ్యవహారాన్ని దాటవేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అదే విషయమై మరోమారు గొడవ జరగడంతో ఆగ్రహం చెందిన అక్తర్ ప్రియురాలి గొంతునులిమడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. కంగారులో ఆమెను ఎత్తుకుని బయటకు తీసుకొచ్చే క్రమంలో రోడ్డు బయట జనాన్ని చూసి అక్కడే పడేసి పరారయ్యాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also: భర్తకి కరోనా.. భార్య మరొకరితో రాసలీలలు.. కాకినాడలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.