యాప్నగరం

Rajasthan దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. 6గురు భక్తులు మృతి

దైవదర్శనం కోసం వెళ్లొస్తున్నవారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంబడించింది. దర్శనం సాఫీగా జరిగిపోయి తిరిగి ప్రయాణమైన భక్తులు.. కాసేపట్లో తమ ఇళ్లకు చేరుకుంటారనగా మృత్యుదేవత ముంచుకొచ్చింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది గాయపడ్డారు. రాజస్థాన్‌లోని పాలీ జిల్లా జరిగిన ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు ట్రాక్టర్‌లో వస్తుండగా భారీ ట్రక్కు ఢీకొట్టడంతో అది పల్టీలు కొట్టింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 20 Aug 2022, 11:22 am

ప్రధానాంశాలు:

  • జైసల్మేర్ బాబా ఆలయ దర్శనానికి భక్తులు.
  • తిరుగు ప్రయాణంలో పాలీ వద్ద ప్రమాదం.
  • ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రాజస్థాన్ రోడ్డు ప్రమాదం
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Rajasthan Accident) సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి పాలీ జిల్లాలో (Pali Accident) భక్తులతో వెళ్తోన్న ట్రాక్టర్ ట్రైలర్‌, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. బాధితులు జైసల్మేర్‌లోని (Jaisalmer) బాబా రామ్‌దేవ్ ఆలయ (Baba Ramdev Temple) దర్శనానికి వెళ్లొస్తుండగా.. సుమేర్‌పుర్ పోలీస్ స్టేషన్ (Sumerpur Police Station) పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు ట్రాక్టర్-ట్రైలర్‌లో వస్తుండగా.. ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆరుగురు భక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.


సుమేర్‌పుర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి రామేశ్వర్ భాటీ మాట్లాడుతూ.. ట్రాక్టర్‌లో జైసల్మేర్ రామ్‌దేవ్రా ఆలయానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించినట్టు పేర్కొన్నారు. రాత్రిపూట ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురయ్యింది.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ‘‘రాజస్థాన్‌లోని పాలిలో జరిగిన ప్రమాదం విషాదకరం.. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.