Madhya Pradesh Accident మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్టాప్లో నిలబడినవారిపైకి వేగంగా వస్తోన్న ఓ ట్రక్కు దూసుకెళ్లింది. రత్లామ్లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వేగంగా వస్తున్న ట్రక్కు.. ట్రాఫిక్ కూడలి వద్ద ఆపడం లేదా వేగాన్ని తగ్గించే బదులుకొంచెం ఎడమవైపు మలుపు తీసుకుని అక్కడ ఉన్న బస్టాప్లోని జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో 10 మంది గాయపడినట్టు రత్లామ్ జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవన్షీ తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఘటన తర్వాత ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడ నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన విశాల్ అనే క్షతగాత్రుడు మాట్లాడుతూ.. వేగంగా వచ్చిన లారీ కనీసం 20 మందిపైకి దూసుకెళ్లిందని అన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ట్రక్కు వారిపైకి దూసుకుపోవడంతో బస్టాప్లో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లారీ కింద నలిగిపోయిన మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. ప్రమాదంతో ఆ ప్రాంతంలో భీతావాహ వాతావరణం నెలకుందన్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులకు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా వాహనం నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అటు, ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు.
Read Latest Crime News And Telugu News
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులకు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా వాహనం నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అటు, ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు.
Read Latest Crime News And Telugu News