యాప్నగరం

UP Fire Accident ఫర్నీచర్ షాపులో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ఆరుగురు సజీవదహనం

UP Fire Accident ఫర్నీచర్ దుకాణం నిర్వహిస్తోన్న ఓ కుటుంబం.. అదే భవనంలోని ఓ అంతస్తులో నివాసం ఉంటోంది. ఊహించని విధంగా దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి.. ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు మంటలకు ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉండటం అత్యంత విషాదం. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి పై అంతస్తుకు వ్యాపించడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని, 18 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేశామని అధికారులు తెలిపారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 Nov 2022, 11:43 am

ప్రధానాంశాలు:

  • షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం
  • పై అంతస్తులో నివాసం ఉంటున్న యజమాని
  • మంటలు అదుపుచేయడానికి 18 ఫైర్ ఇంజిన్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Uttar Pradesh Fire
UP Fire Accident ఓ ఫర్నీచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. విషాదకరమైన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేసి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
బాధిత కుటుంబం ఫర్నీచర్ దుకాణం నిర్వహిస్తోన్న బాధిత కుటుంబం.. అదే భవనంలో నివాసం ఉంటోంది. మంగళవారం తెల్లవారుజామున ఫర్నీచర్ షాపులో ప్రమాదవశాత్తూ షార్ట్ షర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి మొదటి అంతస్థులో ఉన్న యజమాని ఇల్లు కూడా దగ్ధమైంగి. దీంతో లోపల ఉన్న యజమాని, అతడి భార్యా పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ఘోరం జరిగిపోయింది. ప్రమాదం నుంచి బయటపడే సమయం లేకపోవడంతో మంటల్లో కాలిబూడిదయ్యారు.

మంటలు భారీగా ఎగిసిపడటం వల్ల తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని పోలీసులు తెలిపారు. ఆగ్రా, మెయిన్‌పురి, ఇటావా, ఫిరోజాబాద్‌ల నుంచి మొత్తం 18 అగ్నిమాపక వాహనాలను రప్పించారు. 12 పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.