యాప్నగరం

చలిగా ఉందని నిప్పు రాజేస్తే.! చిత్తూరులో ఘోరం

అక్కాబావలను చూడడానికి తమ్ముడు వచ్చాడు. అంతా కలసి ఇంట్లో పడుకున్నారు. చలిగా ఉందని వేడి కోసం కుంపటి రాజేసుకుని పడుకున్నారు. తెల్లారేసరికి ఘోరం జరిగిపోయింది.

Samayam Telugu 29 Nov 2020, 11:55 am
చలిగా ఉందని వేడి కోసం రాజేసిన కుంపటి కొంపముంచింది. పొగ ఇంటిని కమ్మేసి నిద్రలోనే ఉసురుతీసింది. అక్కని చూడడానికొచ్చిన తమ్ముడిని బలి తీసుకుంది. ఈ అత్యంత విషాద ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి గ్రామానికి చెందిన పురుషోత్తం, శైలజ భార్యాభర్తలు. వారికి కుమారుడు హరి ఉన్నాడు. దంపతులు అదే మండలంలోని నేలపల్లె సమీపంలో ఉన్న ఓ కోళ్లఫారంలో పనిచేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
camp fire


అక్కాబావలను చూసేందుకని శైలజ తమ్ముడు రెడ్డప్ప(11) వచ్చాడు. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉందని వేడి కోసం బొగ్గు కుంపటి రాజేసి పడుకున్నారు. చలి వస్తోందని ఇంటి తలుపులు, కిటికీలు బిగించేయడంతో పొగ కమ్మేసింది. నిద్రలోనే అందరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుంపటి పక్కనే పడుకున్న రెడ్డప్ప ఊపిరాడక ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు.

Also Read: మరో మహిళతో తల్లి.! కొడుకు అడ్డుగా ఉన్నాడని.. దారుణం

ఉదయం ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన కోళ్లఫారం యజమాని స్థానికులతో కలసి తలుపులు బద్దలుకొట్టారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శైలజ, పురుషోత్తం, హరిలను 108 అంబులెన్సులో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. రెడ్డప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అక్కని చూసేందుకు వచ్చి తమ్ముడ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్రవిషాదం నింపింది.

Read Also: ఫోన్ ఎత్తని భర్త.. నోరుజారి దొరికిపోయిన భార్య, శ్రీకాకుళంలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.