యాప్నగరం

ఆస్తి కోసం తల్లిదండ్రులకే నిప్పంటించాడు

కణేకల్‌లోని రామ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న నారాయణరెడ్డి, నర్సమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి గ్రామంలో ఎకరా పొలం, సొంత ఇల్లు ఉంది.

Samayam Telugu 3 Mar 2019, 2:40 pm
నేటి సమాజంలో బంధాల కంటే ఆస్తే ముఖ్యమనుకుంటున్నారు కొందరు. రక్త సంబంధాన్ని సైతం కాదనుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లాలో తాజాగా జరిగిన ఘటన బిడ్డలపై ఆశలు పెంచుకునే తల్లిదండ్రులకు కనువిప్పుగా నిలిచింది. కుటుంబ ఆస్తిని తనకు పంచి ఇవ్వడం లేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి కన్న తండ్రులపైనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.
Samayam Telugu suicide


కణేకల్‌లోని రామ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న నారాయణరెడ్డి, నర్సమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరికి గ్రామంలో ఎకరా పొలం, సొంత ఇల్లు ఉంది. ఈ క్రమంలోనే తనకు ఆస్తి పంచాలంటూ వారి చిన్న కుమారుడు మధుసూదన్‌రెడ్డి కొంతకాలంగా తల్లిదండ్రులకు అడుగుతున్నారు. అయితే వారసత్వంగా వస్తున్న పొలం, ఇల్లును విభజించడం ఇష్టం లేని దంపతులు ఆస్తి పంచేందుకు ఆసక్తి చూపడం లేదు.

తనకు ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్న మధుసూదన్‌రెడ్డి ఆదివారం తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. మంటల్లో కాలిపోతున్న వారిని స్థానికులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను కర్ణాటకలోని బళ్లారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.