యాప్నగరం

కన్నతండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు.. జగిత్యాలలో దారుణం

జగిత్యాలకి చెందిన రాజేశం విదేశాలకెళ్లి కష్టం చేసి డబ్బులు పంపించేవాడు. వాటిని ఆయన భార్య, కొడుకులు ఖర్చు చేసేశారు. అది తెలిసి కొడుకులతో తరచూ గొడవపడేవాడు. చివరికి..

Samayam Telugu 27 Jul 2020, 1:13 pm
తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతండ్రిని కడతేర్చాడో కసాయి కొడుకు. ఈ అమానుష ఘటన జగిత్యాలలో జరిగింది. పట్టణంలోని విద్యానగర్‌కి చెందిన రాజేశం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు లక్ష్మీనారాయణ, వెంకట రమణ ఉన్నారు. కొన్నేళ్ల కిందట రాజేశం ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అక్కడే ఉండి డబ్బులు సంపాదించి ఇంటికి పంపించేవాడు. కొద్దికాలం కిందట ఆయన గల్ఫ్ నుంచి వచ్చేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


జగిత్యాలలోనే ఉంటూ తన ఇద్దరు కొడుకులతో కలసి బంగారం పని చేస్తున్నారు. గల్ఫ్‌లో ఉన్న సమయంలో పంపించిన డబ్బుని భార్య, కొడుకులు విచ్చలవిడిగా ఖర్చు చేయడంతో తరచూ గొడవలు జరుతున్నాయి. రాజేశం, చిన్నకొడుకు వెంకటరమణ మధ్య నిత్యం ఘర్షణ జరుగుతోంది. మరోమారు గొడవ జరగడంతో కొడుకు వెంకట రమణ ఆవేశంలో తండ్రిని బండరాయితో కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Also Read: కోడలితో మామ శృంగార లీలలు.. కొడుక్కి తెలిసిపోవడంతో.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.