యాప్నగరం

కొడుకు నీచం.. కన్నతల్లి నగ్నచిత్రాలు తీసి..

తండ్రి చనిపోయి 20 రోజులు గడవక ముందే పూర్వీకుల నుంచి సంక్రమిస్తూ వస్తున్న ఇంటిని తన పేరున రాయాలని తల్లిని వేధించడం ప్రారంభించాడు దినేష్. చివరికి దారుణానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 19 May 2020, 5:55 pm
సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. ఆస్తి కోసం కన్నతల్లిపైనే నీచానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. స్నానం చేస్తుండగా నగ్నచిత్రాలు తీసి వేధింపులకు గురిచేశాడు. ఆస్తి తన పేరు మీద రాయకపోతే ఆ నగ్న చిత్రాలు అందరికీ పంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అత్యంత అమానుష ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


కోట జిల్లాకు చెందిన దీపక్ తివారి(50) ఆస్తి కోసం కన్నతల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తండ్రి చనిపోయిన 20 రోజులకే ఇల్లు తన పేరున రాయాలంటూ తల్లిని పీడించడం మొదలెట్టాడు. అందుకోసం నీచానికి దిగాడు. పూజ చేసుకుంటున్న తల్లి(75)పై దురద వచ్చే ద్రావణం చల్లాడు. ఆమె దురదలు తట్టుకోలేక స్నానం చేసేందుకు బాత్రూమ్‌కి వెళ్లిన సమయంలో ఆమె నగ్న చిత్రాలు తీసి బెదిరించడం ప్రారంభించాడు.

Also Read: బరితెగించిన భార్య.. పడక సుఖం కోసం ప్రియుడితో పారిపోయి.. చివరికి..

పెద్ద వయస్సులో ఉన్న తల్లి నగ్నచిత్రాలు బంధువుల వాట్సాప్ గ్రూప్‌లో పంపించి పైశాచికం ప్రదర్శించాడు. ఆ విషయం బంధువొకరు ఆమెకి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించింది. ఆస్తి కోసం నీచానికి పాల్పడిన కొడుకుపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన దాదాబరి పోలీసులు దినేష్‌ని అరెస్టు చేసి జైలుకి పంపారు.

Read Also: గుంటూరు: ప్రియుడితో గొడవపడి వివాహిత ఆత్మహత్య.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.