యాప్నగరం

సూళ్లూరుపేటలో రోడ్డుప్రమాదం.. ఐదుగురు శ్రీసిటీ ఉద్యోగుల పరిస్థితి విషమం

శనివారం రాత్రి శ్రీసిటీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు... అదుపుతప్పి ముందుగా వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 19 Jul 2020, 12:41 pm
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సూళ్లూరుపేట నుంచి శ్రీసిటీలోని ఓ కంపెనీకి 30 మంది ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మార్గ మలుపు వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
Samayam Telugu Image


Also Read: కేరళ గోల్డ్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్... హైదరాబాద్ హవాలా రాకెట్‌తో లింకులు?

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సూళ్లూరుపేట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో మన్నారు పోలూరుకు చెందిన పట్రంగం భాస్కర్‌, సూళ్లూరుపేటకు చెందిన సిరివేటి సుబ్రహ్మణ్యం, బాపూజీకాలనీకి చెందిన బెల్లంకొండ చెంచురత్నమ్మ, కాపు వీధికి చెందిన ఎ.సుమతి, మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకు తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వరరెడ్డి, ఎస్సై శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: అల్లుడితో అక్రమ సంబంధం.. భర్తకు తెలిసిపోవడంతో ఇద్దరూ కలిసి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.