యాప్నగరం

మహిళా పోలీసుతో ఎస్ఐ శారీరక సంబంధం.. పెళ్లయ్యాక అసలు ట్విస్ట్

శిక్షణ సమయంలో మహిళా ఎస్ఐని వలలో వేసుకున్న ఎస్ఐ సిల్లూధాల ఆమెను శారీరకంగా అనుభవించాడు. తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె ఫిర్యాదు చేిసింది.

Samayam Telugu 25 Aug 2020, 9:10 am
ప్రజలకు రక్షణ కల్పించే ఉద్యోగంలో ఉన్న పోలీసే మోసగాడిగా మారాడు. తనతో పనిచేసే మహిళా ఎస్ఐని శారీరకంగా లొంగదీసుకుని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని పరారయ్యాడు. భర్త ఎక్కడున్నాడో తెలియక బాధితురాలు తల్లడిల్లుతోంది. అతడి చేతిలో మోసపోయానని తెలిసి న్యాయం చేయాలంటూ డీజీపీని ఆశ్రయించింది. ఈ ఘటన ఒడిశాలోని వెలుగుచూసింది.
Samayam Telugu Image


Also Read: సత్తెనపల్లి: మోజు తీరాక వదిలించుకున్న ప్రియుడు.. యువతి ఆత్మహత్య

గంజాం జిల్లా కళ్లికోట పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న సిల్లూధాల అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు ఓ మహిళా ఎస్ఐ సోమవారం భువనేశ్వర్‌లోని డీపీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం.. 2017లో భువనేశ్వర్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతుండగా సిల్లూధాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరైన సిల్లూధాల మాయమాటలతో మభ్యపెట్టి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా నిరాకరించాడు. దీంతో దారింగిబాడి పీఎస్‌లో 2019లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Also Read: అక్కకి సాయంగా వెళ్తే గర్భవతిని చేసిన బావ.. కృష్ణా జిల్లాలో దారుణం

దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిల్లూధాల అంగీకరించాడు. ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకుని కొద్దిరోజులు కాపురం చేశాక మాయమయ్యాడు. 10 నెలలుగా అతడు కనిపించడం లేదని, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని బాధితురాలు చెబుతోంది. మోసగాడైన సిల్లూధాలపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డీజీపీని వేడుకుంది.

Also Read: మహబూబాబాద్‌: పక్కింటి వ్యక్తిని భయపెట్టేందుకు స్నేహితుడి హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.