గురుద్వారాలో ఐసిస్ నరమేధం.. కాబూల్లో 25 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో బుధవారం ఉదయం ఐసిస్ ఉగ్రవాదులురెచ్చిపోయారు. ప్రార్థనలు చేసుకుంటున్న సిక్కులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 25 మంది చనిపోయారు.
Samayam Telugu 25 Mar 2020, 5:05 pm
అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాబూల్లోని షోర్ బజార్ ప్రాంతంలో ఉన్న గురుద్వారాను లక్ష్యంగా గుర్తుతెలియని దుండగులు బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో కాల్పలకు తెగబడ్డారు. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ఆఫ్ఘాన్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిక్ ఏరియన్ నిర్ధారించారు. షోర్ బజార్లోని ధరమ్శాలలో ఆత్మాహుతి దళాలు దాడులకు తెగబడ్డాయని వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Also Read: అమ్మాయిల పిచ్చోడు.. నరరూప రాక్షసుడు.. తమిళనాడును హడలెత్తించిన ‘ఆటో శంకర్’
దాడుల సమయంలో గురుద్వారాలో 150 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని భద్రతా బలగాలు సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. అయితే ఈ దాడులతో తమకెలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. అఫ్గాన్లో సిక్కులపై జరిగిన దాడిని భారత మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు. ‘‘గురుద్వారాపై ఆత్మాహుతి దాడి ఖండించదగినది. వివిధ దేశాల్లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన దాడులకు ఇది నిదర్శనం. మత స్వాతంత్ర్యం, స్వేచ్చను కాపాడాల్సిన సమయమిది’’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఇది తమ పనేపని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.
Also Read: భార్యపై కక్షతో కన్నకూతురిపైనే అత్యాచారం.. చివరికి కొడుకు చేతిలో
Also Read: అమ్మాయిల పిచ్చోడు.. నరరూప రాక్షసుడు.. తమిళనాడును హడలెత్తించిన ‘ఆటో శంకర్’
దాడుల సమయంలో గురుద్వారాలో 150 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని భద్రతా బలగాలు సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. అయితే ఈ దాడులతో తమకెలాంటి సంబంధం లేదని తాలిబన్లు ప్రకటించారు. అఫ్గాన్లో సిక్కులపై జరిగిన దాడిని భారత మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు. ‘‘గురుద్వారాపై ఆత్మాహుతి దాడి ఖండించదగినది. వివిధ దేశాల్లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన దాడులకు ఇది నిదర్శనం. మత స్వాతంత్ర్యం, స్వేచ్చను కాపాడాల్సిన సమయమిది’’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఇది తమ పనేపని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.
Also Read: భార్యపై కక్షతో కన్నకూతురిపైనే అత్యాచారం.. చివరికి కొడుకు చేతిలో