తన భార్యతో అక్రమ సంబంధం వదులుకోవాలని కోరిన భర్తను ఓ జోతిష్యుడు దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని వెన్నందూరుకు చెందిన కృష్ణన్ (55) సెంట్రింగ్ పని చేస్తున్నాడు. అతని భార్య వసంతి (45) టైలరింగ్ దుకాణం నడుపుతోంది. వీరికి ఓ కుమారుడు మోహన్ (25) ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం కృష్ణన్కు సేలం జిల్లా చిన్నప్పన్పట్టికి చెందిన జ్యోతిష్కుడు రామచంద్రన్ (35)తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రామచంద్రన్ అప్పుడప్పుడు కృష్ణన్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే కృష్ణన్ భార్య వసంతితో రామచంద్రన్కు అక్రమ సంబంధం ఏర్పడింది.
Also Read: మహిళా వార్డు వలంటీర్ను దారుణంగా చంపిన జర్నలిస్టు
దీంతో తన భార్యతో అక్రమ సంబంధం వదులుకోవాలని కృష్ణన్ ఎన్నో సార్లు చెప్పాడు. అయినా రామచంద్రన్ వినకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హెచ్చరించినా రామచంద్రన్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామచంద్రన్ సోమవారం రాత్రి కూడా వసంతితో మాట్లాడాలంటూ కృష్ణన్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రామచంద్రన్ మద్యం మత్తులో ఉండటంతో అతనికి నచ్చజెప్పి పంపించడానికి కృష్ణన్, మోహన్లు బస్టాండ్కు తీసుకువచ్చారు.
ఆ సమయంలో రామచంద్రన్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో కృష్ణన్ను పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కృష్ణన్ను సేలం జీహెచ్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం కృష్ణన్ను అరెస్టు చేశారు. వెన్నందూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Also Read: షాక్.. కర్నూలులో కన్న కూతురిని రేప్ చేసిన తండ్రి
Also Read: మహిళా వార్డు వలంటీర్ను దారుణంగా చంపిన జర్నలిస్టు
దీంతో తన భార్యతో అక్రమ సంబంధం వదులుకోవాలని కృష్ణన్ ఎన్నో సార్లు చెప్పాడు. అయినా రామచంద్రన్ వినకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హెచ్చరించినా రామచంద్రన్ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామచంద్రన్ సోమవారం రాత్రి కూడా వసంతితో మాట్లాడాలంటూ కృష్ణన్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రామచంద్రన్ మద్యం మత్తులో ఉండటంతో అతనికి నచ్చజెప్పి పంపించడానికి కృష్ణన్, మోహన్లు బస్టాండ్కు తీసుకువచ్చారు.
ఆ సమయంలో రామచంద్రన్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో కృష్ణన్ను పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కృష్ణన్ను సేలం జీహెచ్కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం కృష్ణన్ను అరెస్టు చేశారు. వెన్నందూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Also Read: షాక్.. కర్నూలులో కన్న కూతురిని రేప్ చేసిన తండ్రి