యాప్నగరం

సిగరెట్‌ తాగొద్దని భార్య మందలింపు... యాసిడ్ తాగి భర్త సూసైడ్

సిగరెట్ తాగడం మానేయాలని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నైలోని సాలిగ్రామంలో జరిగింది. బాత్రూమ్‌లో యాసిడ్ తాగడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 10 Apr 2020, 12:28 pm
సిగరెట్ వ్యసనాన్ని మానుకోవాలని భార్య మందలిచడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు రాజధాని చెన్నైలోని సాలిగ్రామం మదియళగన్‌కు చెందిన నరసింహన్(72) ఆర్టీసీలో బస్ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. పిల్లలు వేరే ప్రాంతాల్లో సెటిల్ కావడంతో భార్యభర్తలిద్దరే అక్కడ నివసిస్తున్నారు. నరసింహన్‌కు కొన్నాళ్లుగా సిగరెట్ తాగడం అలవాటుంది. ఇటీవల ఆ అలవాటు కారణంగా తరుచూ దగ్గుతున్నాడు. దీంతో అలవాటు మానేయాలని అతడి భార్య తరుచూ మందలిస్తోంది.
Samayam Telugu dead body


Also Read: లాక్‌డౌన్‌లో ప్రేమ పెళ్లి.. 70 కి.మీ.లు ఒంటరిగా నడిచి ప్రియుడిని చేరుకున్న యువతి

ఇదే విషయంపై బుధవారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నరసింహన్ బాత్‌రూమ్‌లోకి వెళ్లి యాసిడ్ తాగి స్పృహ తప్పి పడిపోయాడు. భర్త ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో ఆందోళన పడిన అతడి భార్య స్థానికుల సాయంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూసింది. అపస్మారక స్థితిలో పడివున్న నరసింహన్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: తల్లితో కలిసి అత్తను హతమార్చిన కోడలు.. ఏడాది తర్వాత వెలుగులోకి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.