యాప్నగరం

ఆస్తి కోసం తల్లి, చెల్లి దారుణహత్య... తమిళనాడులో దారుణం

ఆస్తి కోసం కొన్నాళ్లుగా తల్లితో గొడవపడుతున్న మునిరాజ్ బుధవారం మరోసారి ఆమెపై గొడవపడ్డాడు. ఆవేశంలో తల్లి, చెల్లిని కొబ్బరిమట్టతో కొట్టి ప్రాణం తీశాడు.

Samayam Telugu 11 Jun 2020, 8:26 am
ఆస్తి తగాదాల కారణంగా కన్నతల్లి, చెల్లెలి దారుణంగా చంపేశాడో కిరాతకుడు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపం పరదరామి తలైవార్‌ పట్టి గ్రామానికి చెందిన ఇంద్రాణి అమ్మాళ్‌ (70)కు కుమారులు మునిరాజ్‌(40), సూరి, కుమార్తె చిన్నమ్మ ఉన్నారు. కుమారులకు వివాహమై వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. చిన్నమ్మకు ఇంకా వివాహం కాకపోవడంతో తల్లితోనే ఉంటోంది.
Samayam Telugu Image


Also Read: ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో అఫైర్.. భార్యను నిర్బంధించి, గుండు గీయించిన భర్త

కుటుంబ ఆస్తిగా వచ్చిన భూమి విషయంపై తల్లితో మునిరాజ్‌ కొన్నాళ్లుగా గొడవ పడుతున్నాడు. ఆస్తిలో తన వాటాను పంచాల్సిందిగా కోరుతుండగా కూతురికి పెళ్లి చేసేవరకు ఆస్తి పంచేది లేదని ఆమె తెగేసి చెబుతోంది. ఇదే విషయమై మునిరాజ్ బుధవారం మరోసారి తల్లితో గొడవపడ్డాడు. ఆవేశంతో కొబ్బరిమట్ట, రాళ్లతో తల్లి, చెల్లిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో మునిరాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఐదేళ్లు సహజీవనం చేసి.. పెళ్లి చేసుకోమంటే పారిపోయాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.